నకిలీ అధికారులు బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు
- జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కల్లూరుకి చెందిన వ్యక్తిపై ఫిర్యాదు.
- NHRC Case No.149/39/4/2023
- BSSM తెలంగాణ రాష్ట్ర కమిటీ
ఖమ్మం : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరుకి చెందిన వ్యక్తి సోషల్ జస్టిస్ ఫోరమ్ పేరుతో ప్రజలకు న్యాయం చేస్తామని అమాయికులు అయిన గిరిజనులతో ఆర్గనైజేషన్ లో పని చేసే వారి మీద అక్రమ కేసులు పెట్టీస్తూ, ఆఫీస్ లకు పిలిపించుకొని పది లక్షలు, పదిహేను లక్షలు చొప్పున డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే మీ మీద నేషనల్ ఎస్టీ కమిషన్ లో చాలా పరిచయాలు ఉన్నాయని అక్కడ మెంబర్ ఉన్నాడు అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.BSSM తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేసు పెట్టడం జరిగింది.
అదే క్రమంలో మద్దిశెట్టి సామేలు గారిని కూడా 20 లక్షలు రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది.ఇవ్వలేదు అని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించడం జరిగింది. అదే క్రమంలో మరో 3 కేసులు పెట్టించాలని చూస్తున్నాడు. దీని మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన కమిషన్ 18 మంది మిద కేసు నమోదు చేశారు. అదే విధంగా గౌరవ హై కోర్టు నీ ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికైనా మీరు చేసే పనులు మనుకొక పోతే BSSM కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని, ఆఫీస్ కి వచ్చి మరి పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తామని హెచ్చరిస్తున్నాము.