రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట
- DCMS వైస్ చైర్మన్ కొత్వాల
కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రెవేశపెట్టిన 2023 - 24 బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. బడ్జెట్ లో సుమారు 27 వేల కోట్లు కేటాయిస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. రైతు బంధు పధకానికీ 15 వేల కోట్లు కేటాయించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. బడ్జెట్ లో సంక్షేమంతో పాటు పేదరిక నిర్ములనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని కొత్వాల అన్నారు.