జగ్గారం పోడు భూములపై విచారణ జరపండి
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం పోడు భూములపై విచారణ జరపాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారి అధ్వర్యంలో కొత్తగూడెం ఫారెస్ట్ డి ఎఫ్ ఓ గారి ఆఫీస్ కి వెళ్లడం జరిగింది.జగ్గారం కి సంబందించి సర్వే నంబర్ 400,400/2 పూర్తి విచారణ జరిపి 250 మంది పోడు రైతులకు పట్టా హక్కులు కల్పించాలని, అదే విధంగా చింతీర్యాలగూడెం గ్రామానికి సంబందించి సర్వే నంబర్ 191,192/2 లో పోడు భూములకు పట్టా హక్కులు కల్పించాలని, కేవలం 100 మందిని సాగు చేసుకోమని 150 మందికి అన్యాయం జరిగిందని, అధికార పార్టీ సపోర్ట్ ఉన్నవాళ్ళకి మాత్రమే సాగు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారని దీనిపై విచారణ జరిపి 250 మందికి భూములు ఇవ్వాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది. 250 మందికి పట్టా హక్కులు కల్పించే వరకు ఆర్పీఐ పార్టీ అండగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోడు సాగుదారులు ఊకె చిట్టెమ్మ, కంబాలపల్లి వెంకన్న, పరిడిబోయిన సోమలింగం, రమేష్, దగ్గుబాటి బిక్షం, చింతిర్యాలగూడెం, జగ్గారం, కొమ్ముగుడెం, అశ్వాపురం కాలువ బజారు గిరిజనులు పాల్గొన్నారు.