ఎమ్మెల్యే సహకారంతో ఈద్గాహ్ అభివృద్ధి పనులు ప్రారంభం
తాండూరు : తాండూరు పట్టణంలో జామియత్ ఆహ్లఏ హాదీస్ ఈద్గాహ్, హైదరాబాద్ రోడ్ కోసం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు 20 లక్షల రూపాయల మంజూరు చేసారు.నేడు ఈద్గాహ్ కమిటీ మరియు ప్రజా ప్రతినిధులు ఈద్గాహ్ చేరుకొని,ఎమ్మెల్యే ఫండ్ తో నేడు ఈద్గాహ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.ప్రత్యేక చొరవ తీసుకుని 20 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఈద్గాహ్ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నేడు పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు గారు, ఈద్గాహ్ కమిటీ సభ్యులకు ఈద్గాహ్,హైదరాబాద్ రోడ్ కి చేరుకొని,అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో బిఅరెస్ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు, ఈద్గాహ్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్లాహ్ ముజాహిది, జామియత్ ఆహ్లఏ హాదీస్ అధ్యక్షులు ఉస్మాన్ ఘాని మోహమ్మది, కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్ ముజాహిది, కోశాధికారి అబ్దుల్ అలీం శాల్లో, హస్నోద్దీన్ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.