ఖబర్ధార్ మురళీకృష్ణ గౌడ్,పైలెట్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
* మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కి వార్నింగ్
* ఎమ్మెల్యే గారి వెంబడి ఉండి ఎన్నో అక్రమాలు
* పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదు
* బిక్ష పెడితే జిల్లా గ్రంథాలయం చైర్మన్ అయినావు
తాండూర్ : తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం పైలట్ రోహిత్ రెడ్డి గారిపై మురళీకృష్ణ గౌడ్ నోరు పారేసుకోవడం సమంజసం కాదు ఎమ్మెల్యే గారి బిక్ష పెడితే జిల్లా గ్రంథాలయం చైర్మన్ అయినావు గుర్తుంచుకో, ఎమ్మెల్యే గారి వెంబడి ఉండి ఎన్నో అక్రమాలకు పాల్పడినావు.ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడానికి సిగ్గుండాలి.నాడు ఎమ్మెల్యే గారి వెంబడి ఉండి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో పనులు చేశారు.ఈ రోజు ఎమ్మెల్యే గారు తాండూర్ నియోజకవర్గ ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కొందరితో చేతులు కలిపి పిచ్చిగా మాట్లాడడం మంచిది కాదు.ఒకపక్క తాండూర్ ప్రజలందరూ రోహిత్ రెడ్డి గారి పనిని చూసి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతుంటే కావాలని కొన్ని నీలాంటి చీడపురుగులు పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరిస్తున్నాం.మురళి కృష్ణ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం కావొద్దు అని హెచ్చరిస్తున్నాం.మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్,మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆనంద్, సీనియర్ నాయకులు లక్కాకుల మల్లేశం, పతంగి పాండు, అనిల్ దొర, బీఆర్ఎస్ పార్టీ కోటపల్లి అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా,అన్నా సాగర్ అధ్యక్షులు కృష్ణ,లింగంపల్లి అధ్యక్షులు అనంతరెడ్డి,బుగ్గాపురం ఇన్చార్జి నర్సింలు గౌడ్,మండల నాయకులు ఓగులాపురం రాజు,మోసిన్,సుశీల్ కుమార్,మంగలి నాగేష్,దినేష్ కుమార్,చిన్న,పాండు,బందప్ప,దిలీప్ కుమార్,నర్సింలు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యాలాల్ లో కామాంధుడి కారులో బాలిక లైంగిక దాడి |