కూలీలపై దౌర్జన్యం చేస్తున్న ఇందూరు రాములు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
తాండూర్ Tandur : పనికోసం వచ్చిన గిరిజన మేస్ట్రీ,గిరిజన మహిళపై తాండూరుకు చెందిన ఇందూరు రాములు దౌర్జన్యం ప్రదర్శించారు.శనివారం యాలాల మండలం బషీర్ మియా తాండాకు చెందిన బాబు మేస్త్రీ దేవిలు తాండూరు పట్టణ ఓ ఇంటి వద్ద పనిచేసే అక్కడికి వచ్చిన సాయిపు ఇందూరు రాములు బాబు మేస్త్రి,దేవిలతో వాగ్వివాదానికి దిగారు.ఇరువురి మధ్య మాటా మాట పెరిగింది.ఈ క్రమంలో ఇందూరు రాములు మేస్త్రీ బాబు,దేవిలపై దాడికి పాల్పడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ సమాచారం తెలుసుకున్న కెజిబివి అధ్యక్షులు మల్కయ్య చేసుకొని దాడి విషయని తెలుసుకొని కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.దీంతో బాధితులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేస్తామని పటణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.