తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ మసిఉల్లాహ్ తో భేటీ
తాండూర్ : తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు తాండూరు పట్టణ బిఆర్అఎస్ అధ్యక్షులు నయీమ్ అప్ఫు మరియు ప్రజా ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ మసిఉల్లాహ్ గారికి కలిసి సన్మానించారు.తాండూరు వక్ఫ్ ల్యాండ్ లో అనేక అభివృద్ధి పనుల గురుంచి చర్చించారు.వచ్చే కొన్ని మాసాల్లో వక్ఫ్ ప్రాపర్టీలో మైనార్టీ సంక్షేమ కోసం అనేక అభివృద్ధి పనులు చేరుకుస్థానని హామీ ఇయ్యడం జరిగిందని బిఅరెస్ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు తెలిపారు.ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యం లో తాండూరు అభివృద్ధి కోసం తన వక్ఫ్ బోర్డ్ పూర్తి సహకారం అందిస్తామని వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ మసిఉల్లాహ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌంక్సీల్లోర్ అస్లాం, మల్కాపూర్ ఉప సర్పంచ్ హుస్సేన్ పటేల్, పట్టణ ప్రధాన కార్యదర్శి సలీం,సీనియర్ నాయకులు ముంషాద్ పాల్గొన్నారు.