Type Here to Get Search Results !

Sports Ad

వేదింపులు తాళలేక..మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నం In Warangal

 

వేదింపులు తాళలేక..మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నం


* వరంగల్  KMC  ఎంజీఎంలో కలకలం
* పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి  ఆత్మహత్యాయత్నం
* బాధాకరమైన దుర్ఘటను ఖండించిన గుగులోతు శివవర్మనాయక్
 * లంబాడీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (LSO)  అధ్యక్షులు గుగులోతు శివవర్మనాయక్

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా లంబాడీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (LSO)  అధ్యక్షులు గుగులోతు శివవర్మనాయక్ మాట్లాడుతూ జనగాం జిల్లా కోడకండ్ల మండలం ముండ్రాయి గిర్నితండకు చెందిన ధరావత్ నరేందర్, శారద దంపతులకు కుమార్తె అయిన ధరావత్ ప్రీతి తను గాంధీ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కేఎంసిలో  పీజీ మొదటి  సంవత్సరం చదువుతుంది. ప్రీతి ఎంజీఎం ఆసుపత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి ఆపరేషన్ థియేటర్ లో విధులు నిర్వహిస్తుంది. అక్కడ పరిచయమైన సీనియర్ విద్యార్థి రాగింగ్ చేస్తూ ఆమెని మానసికంగా శారీరకంగా వేధించాడు అదేవిధంగా తక్కువ కులం అంటూ హేళన చేశాడు.వేదింపులకు కారకులైన నిందితులను  చట్టపరంగా కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.విషయం తెలిసి నిర్లక్ష్యం వహించిన కళాశాల యాజమాన్యం పై కూడ చర్యలు తీసుకోవాలి.లేనియెడల అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము అని అన్నారు. మరియు వెంటనే ప్రీతీకి  మంచి వైద్యం అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో బానోతు తరుణ్ నాయక్,భూక్యా సిద్దు నాయక్,భూక్యా సందీప్, బొడ రము నాయక్,ఈశ్లవత్ విష్ణు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 హత్ సే హత్ అభియాన్ జోడో యాత్ర

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies