బిజెపి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్య
- కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్
తాండూర్ : బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పై కక్ష సాధింపు చర్య చేస్తుంది.తాండూర్ నియోజకవర్గం కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల ఏరా కేసులో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఈడి, సిబిఐ సంస్థలను వాడుకొని బిజెపి వారి కుట్రాలను రెడ్ హ్యాండ్ గా భగ్నం చేసిన తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారు మరియు తెలంగాణ ఎమ్మెల్యేలపై కావాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రయోగించడం ఎంతవరకు సమంజసం. తెలంగాణ ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయించింది. అంటే బిజెపి వాళ్లకు తెలంగాణ పోలీసు పై నమ్మకం లేదు అని తెలుస్తుంది. కావాలని బిజెపి ప్రభుత్వం ఒక పక్క ఎమ్మెల్యేలను కొనాలని చూసి అది సాధ్యం కాకపోవడంతో మరోపక్క ఈడి, సిబిఐలను, ప్రయోగించడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నాం.