ప్రేమించి పెళ్లాడాడు..వ్యభిచారం చేయాలని భార్యపై ఒత్తిడి
గుంటూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ టార్చర్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు ఒప్పు కోకపోతే చనిపోతానన్నాడు.అతని ప్రేమ నిజమని నమ్మి ఆమె ఇంట్లో చెప్పడంతో కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు.చివరకు ముగ్గురు పిల్లలు పుట్టారు.ఇక అక్కడ నుండి వ్యభిచారం చేయాలని ఆమెను టార్చర్ మొదలుపెట్టాడు.చేసేది ఏమి లేక ఇష్ట పడిన భర్త వేధిస్తున్నాడని గుంటూరుకు చెందిన ఓ మహిళ ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేసింది.ఇటీవల తన కొడుకును కిడ్నాప్ చేసి వ్యభిచారానికి ఒప్పుకోకపోతే చంపేస్తానని భర్త బెదిరించాడని కన్నీటి పర్యంతమయింది.పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.