Type Here to Get Search Results !

Sports Ad

"మా నమ్మకం నువ్వే జగన్" ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి "Ma Pravannu Nuvve Jagan" Food Processing Minister Kakani Govarthan Reddy.

 

"మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమంలో పాల్కొన్న ప్రజలు 

- రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాలను అమలు  
- చంద్రబాబు హయంలో జరిగిన మోసపు హామీలు
- ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

మనుబోలు : మనుబోలు మండల కేంద్రంలోని సీపీఆర్ కళ్యాణమండపంలో నిర్వహించిన "మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి,మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు."మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమంలో భాగంగా నూతనంగా తయారుచేసిన కరపత్రాల్లో ఉన్న విషయాలను తెలిపారు.చంద్రబాబు హయంలో జరిగిన మోసపు హామీలు, వైఫల్యాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంను వివరిస్తూ ఈ కరపత్రాలు ఉంటాయని,బడుగు బలహీన వర్గాలకు పార్టీ అనే చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి ఓనగూర్చింది ఏమీ చేయలేదని విమర్శించారు.ప్రస్తుత  జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజకీయాలకతీతంగా అర్హతే ప్రామాణికంగా, వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.ఎక్కడికి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నరు.


"గడప గడపకు మన ప్రభుత్వం" చాటి చెప్పాలి 


- ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు
- ప్రజలకు అండగా ఉంటాం 

సర్వేపల్లి :  సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం,ఇస్కపాళెం గ్రామ సచివాలయ పరిధిలో 2వ రోజు ఇస్కపాళెం గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి.మంత్రి కాకాణికి ఘన స్వాగతం పలకేందుకు భారీగా తరలివచ్చిన ఇస్కపాళెం గ్రామస్తులు.



ప్రతి కుటుంబాన్ని పలకరించి, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను ఆరా తీయడంతో పాటు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, సత్వర పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు చేపట్టవలసిందిగా సూచించారు.ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నరు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మంత్రి కాకాణికి ఎల్లవేళలా తాము అండగా నిలుస్తామని పేర్కొన్న గ్రామస్తులు.భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన ఇస్కపాళెం గ్రామస్తులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies