Type Here to Get Search Results !

Sports Ad

ఆరోపణలు చేస్తున్న వారిపై హై కోర్టు లో పిటిషన్ మద్దిశెట్టి Madhishetti

 

ఆరోపణలు చేస్తున్న వారిపై హై కోర్టు లో పిటిషన్ మద్దిశెట్టి 

కొత్తగూడెం : మద్దిశెట్టి పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వారిపై హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేయనున్నా రాష్ట్ర కమిటీ.రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారిపై గత కొన్ని రోజులుగా కొంతమంది వ్యక్తులు అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయిస్తున్నారని, అంతే కాకుండా ఈరోజు 18 మందిపై అనగా జూలూరుపాడు, కొత్తగూడెం, అశ్వపురం, టేకులపల్లి, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు సంబందించి చెందిన వారికి లీగల్ నోటీసులు తయ్యారు చేసి పంపించడం జరిగింది. అనంతరం వారిపై 2 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా పిటిషన్ వేస్తామని తెలియజేస్తున్నాము.ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు ఆపాలని లేని పక్షంలో వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము.అదే విధంగా మీడియా మిత్రులు కూడా వాస్తవాలు, నిజ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని కోరుకుంటున్నాము.

500 మంది కార్యకర్తలతో ర్యాలీ,పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

మద్దిశెట్టి సామేలు గారిపై తప్పుడు కేసులు పెట్టాలని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తుల పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఈరోజు 500 మంది కార్యకర్తలతో BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు గారిపై కొంతమంది వ్యక్తులు తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, న్యూస్ పేపర్ లో రాస్తున్నారని ర్యాలీ చేయడం జరిగింది. అనంతరం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.అదే విధంగా ఎవరైనా మద్దిశెట్టి సామేలు గారిపై తప్పుడు కేసులు పెట్టిన, పెట్టాలని చూసిన, ఎటువంటి ఆధారాలు లేకుండా న్యూస్ పేపర్ లో రాసిన 30 మండలాల్లో ఉన్న లక్షా యాభై వేల మంది కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని, ఇంటికి వచ్చి లాక్కొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తామని హెచ్చరిస్తున్నాము.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies