బుల్లెట్ ప్రూఫ్ వాహనం నాకొద్దు అంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్,హోం మంత్రి మహమూద్ అలీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పాడవుతుందని ఎన్నిసార్లు చెప్పినా తిరిగి అదే బండి కేటాయిస్తున్నారని మండిపడ్డారు.ఇవాళ అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంటే వాహనం ముందు చక్రం ఊడిపోయిందన్నారు.బండి వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.తనకు ఇచ్చిన వాహనాన్ని మార్చాలని లేదంటే మీ వాహనం మీరు తీసుకోండి అంటూ పరుషపదజాలంతో వ్యాఖ్యానించారు.
హృదయ విదారకమైన సంఘటన
ఆంధ్ర ప్రదేశ్ : ఏపీలో దారుణమైన సంఘటన భార్య మృత దేహాన్ని భుజంపై వేసుకొని వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కోరాపుట్లోని తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని ఇంటికి వెళ్తున్న దృశ్యాలు.నిరుపేద గిరిజనులు వైద్యం కోసం వైజాగ్ వచ్చిన భార్య,భర్తలు ట్రీట్మెంట్ తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో భార్య మృతి చెందిది.ఆటో డ్రైవర్ రోడ్డు మధ్యలోనే మృతదేహాన్ని వదిలేసిన వెళ్లిపోయాడు.ఇక చేసేది ఏమీ లేక వందల కిలోమీటర్లు మృత దేహాన్ని మోస్తూ వెళ్తుండగా ఏపీ పోలీస్ కంట పడ్డరు.ఈ విషయం తెలుసుకున్న విజయనగరం రూరల్ సీఐ తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి తన గమ్యానికి చేర్చారు.