తెలంగాణ ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్
- కల్యాణ లక్ష్మీ,షాధిముభారక్ చెక్కుల పంపిణీ
- ఎమ్మెల్యే వనమా
పాల్వంచ : పాత పాల్వంచ పట్టణంలోని ఎమ్మెల్యే వనమా వెంకటెశ్వరరావు గారి కార్యాలయంలో లక్ష్మిదేవిపల్లి మండలానికి సంబంధించిన సుమారు రూ.1,10,00,000.00 (ఒక కోటి పది లక్షల రూపాయల) విలువ గల 110 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే వనమా గారు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా గారు మాట్లాడుతూ పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనా, సర్పంచ్లు అజ్మీరా భారతి, కొరెం చంద్ర శేఖర్, జోగ బక్కయ్య, వర్సా వసంత రావు, కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ డైరెక్టర్లు శేషాద్రి వినోద్, పొగాకు వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి తాసిల్దార్ నాగరాజు , ఆర్ఐ నరసింహ రావు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు
కొత్తగూడెం ఉర్దూ ఘర్ షాది ఖానా లో సఫాయి బస్తి నివాసి అబ్దుల్ రహుపు గారి కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కొత్తగూడెం ఉర్దూ ఘర్ షాది ఖానా కో ఆర్డినేటర్ ఎండి యాకూబ్ పాషా 22 వ వార్డు మరియు రిటైర్డ్ ఎస్సై ఖాయ్యం గారు అబ్దుల్ సలాం శిరసాని శ్రీకాంత్ అన్ను అజ్మద్ భాయ్ అన్వర్ బాయ్ మరియు తదితరులు పాల్గొన్నారు.