నందమూరి తారకరత్న కన్నుమూత
నటుడు నందమూరి తారకరత్న Nandamuri Tarakaratna ఇకలేరు కుప్పంలో జనవరి 27న నారా లోకేష్ ప్రాదయాత్ర ప్రారంభ సమయంలో గుండెపోటుకు గురైన ఆయనకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించి జనవరి 28న బెంగళూరులోని నారాయణ హృదయాలయానకు తరలించారు.అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందిస్తోంది.తీవ్ర గుండెపోటు సహా ఇతర అనారోగ్య సమస్యల వల్ల నందమూరి వారసుడు తుదిశ్వాస విడిచారు.
1983 ఫిబ్రవరి 22 (40) జన్మించిన తారక రత్న.నందమూరి వారసుడు గా 2002 లో హీరో గా తారక రత్న ఎంట్రీ ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కెక్కిన తారక రత్న.ఒకే రోజు 9 సినిమా ల ప్రారంభం ప్రపంచం లో మారే హీరో కి లేని అరుదైన రికార్డ్ హీరోగాHero, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించిన తారకరత్న.షూటింగ్ దశలో వున్న మరో రెండు చిత్రాలు ఉన్నాయి.రిలీజ్ కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్ సినిమా ఉంది.లాస్ట్ ఇయర్ 9 hours అనే వెబ్ సిరీస్ లో నటించిన తారక రత్న పాల్కొన్నారు.ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నరు.కూతురు పేరు నిష్క ఒకటో నెంబర్ కుర్రాడు, యువ రత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, భక్త సిరియలు, సారధి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు.2009 లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు.
బ్రెయిన్ డెడ్కారణంగా తారకరత్న కన్నుమూసినట్టు తెలుస్తుంద.అత్యంత రహస్యంగా తారకరత్న పార్థివదేహం బ్యాక్ గేట్ ద్వారా తరలింపు.కర్ణాటక పోలీసులు బందోబస్తు మధ్య బెంగళూర్ నుండీ తారకరత్న పార్థివదేహం హైదరాబాద్ కు తరలింపు.ఎస్కార్ట్ వాహనాలతో బయల్దేరిన అంబులెన్స్ ఈ నేపథ్యంలో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్కి తరలించారు.అంబులెన్స్ ద్వారా ఆయన మృతదేహాన్ని తరలిస్తున్నారు.తారకరత్న కన్నుమూశారనే వార్తతో స్థానికంగా ఉన్న అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు.అభిమాన నటుడిని చివరిసారి చూసేందుకు భారీగా తరలి వచ్చారు.
అభిమానుల తాకిడిని గమనించిన వైద్య బృందం.రేపు(ఆదివారం)ఉదయం వరకు ఆయన మృతదేహం హైదరాబాద్కి చేరే అవకాశం ఉంది.తారకరత్నని బ్యాక్ గేట్ ద్వారా తరలించడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తారకరత్నని చూసేందుకు చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నామని, ఆయన్ని చూడాలని తపించామని, కానీ తమకు సమాచారం ఇవ్వకుండా, చూడనివ్వకుండా బ్యాక్ గేట్ ద్వారా తరలించడం పట్ల వాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.తమకి బాడీని చూపించాలని,చూపించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.