Type Here to Get Search Results !

Sports Ad

పూవ్వుల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు People are welcomed with shower of flowers

 

పూవ్వుల వర్షంతో స్వాగతం పలికిన ప్రజలు 

సర్వేపల్లి : గడప గడపకు హాజరైన మంత్రికి పూలమాలలతో,మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు,గ్రామ ప్రజలు.సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరకావిపూడి  గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార,మార్కెటింగ్,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి.ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతీరును ఆరా తీయడంతో పాటు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సుమారు మూడున్నరేళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత ప్రజల ముంగిటకు వెళుతున్న తమకు, ప్రజలు ఎదురేగి నీరాజనాలు పలుకుతున్నారని, ఇదే జగనన్న ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.వరకావిపూడి గ్రామంలో పర్యటించిన కాకాణికి స్థానికంగా నివసించే అన్ని వర్గాల వారు ఎదురేగి,ప్రతి కాలనీలో ఘన స్వాగతం పలికారు. వరకావిపూడి యువత ఆధ్వర్యంలో వినూత్న రీతిలో భారీగా ఏర్పాటు చేసిన కేకులను,యువత కేరింతల మధ్య కట్ చేసి సంతోషంగా పాల్కొన్నారు.ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies