Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి Punjab Chief Minister reached Hyderabad

 

హైదరాబాద్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి

హైదరాబాద్ : పంజాబ్ సీఎం భగవత్ మాన్ ఈ రోజు ఉదయం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో పర్యటించనున్నారు.అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ మల్లన్న సాగర్  రిజర్వాయర్ లను సందర్శిస్తారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని  రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సమావేశమై ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకుంటారు. నిన్న రాత్రి నగరానికి చేరుకున్న ఆయన కెసిఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.



కొండపోచమ్మ సాగర్ ను పరిశీలించిన పంజాబ్ ముఖ్యమంత్రి  

గజ్వేల్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మన్  పర్యటించారు. ప్రాజెక్టు వివరాలను పంజాబ్ సీఎంకు అధికారులు వివరించారు. ప్రాజెక్టు వివరాలను పంజాబ్ సీఎంకు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారి రజిత్ కుమార్ పూర్తి వివరాలను వెల్లడించారు.11 గంటలకు రావాల్సిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మన్  అరగంట ముందే సిద్దిపేటకు చేరుకున్నారు   అక్కడ నిర్వహించిన కాలేశ్వరం ప్రాజెక్టు పనులను కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిశీలించారు. కంట్రోల్ రూమ్ కి వెళ్లి విద్యుత్ సరఫరా ఏవిధంగా అందిస్తున్నారన్న వివరాలను తెలుసుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies