Type Here to Get Search Results !

Sports Ad

కెసిఆర్ సార్ సారధ్యంతోనే ప్రజలకు సురక్షితమైన పాలన Safe governance for the people under the leadership of KCR

 

కెసిఆర్ సార్ సారధ్యంతోనే ప్రజలకు సురక్షితమైన పాలన

- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 

వికారాబాద్ : గురువారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లిలో గల భారత రాష్ట్ర సమితి పార్టీ వికారాబాద్ జిల్లా కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా బ్లడ్ డొనేషన్ నిర్వహించారు.ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి పాలనలో ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తున్నారని,దేశ రాజకీయాలకు కూడా కేసీఆర్ సార్ సారధ్యం అవసరమైన సందర్భం వచ్చిందని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో ఆవిష్కరణలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,యువనాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies