బీసీ సంక్షేమ సంఘం పెద్దేముల్ మండల అధ్యక్షులుగా సర్పంచ్ శ్రావణ్ కుమార్
- ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం
- జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య
- నియామకపత్రంని అందజేసిన ఆర్.కృష్ణయ్య
పెద్దేముల్ : బీసీ సంక్షేమ సంఘం పెద్దేముల్ మండల అధ్యక్షులుగా మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్ కుమార్ నియామకం అయ్యారు.మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ నియామకం జరిగింది.హైదరాబాద్ లోని బీసీ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా శ్రావణ్ కుమార్ నియామకపత్రంని అందజేశారు.ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు.
నూతనంగా నియమితులైన అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బీసీల సమస్యలు,డిమాండ్ల సాధనకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. బీసీ సంఘం మండల అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆర్.కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మారేపల్లి తాండ సర్పంచ్ పాండు, హన్మాపూర్ సర్పంచ్ వెంకటేష్, యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి,పెద్దముల్ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సంగమేశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముజీబ్, కురుమ సంఘం నాయకులు చంద్రయ్య,పెంటయ్య, బాలయ్య,నాయకులు నర్సింలు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకటయ్య, సగర సంగం సభ్యులు, మాజీ బాలప్ప,గోట్లపల్లి సర్పంచ్ శేఖర్,కందనెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు స్వరాజ్ కార్యకర్తలు తదితరులు పాల్కొన్నారు.