రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు ఎస్ఐ
బషీరాబాద్ : నిందితులను రిమాండ్కి తరలించిన ఎస్ఐ.ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొన్న అన్న తేది 13-02-2023 నాడు బషీరాబాద్ మండలం కేంద్రంలోని నవాని PACS కేంద్రంలో శనగల కొనుగోలు వద్ద తూకంలో రైతులను మోసం చేసిన విషయంలో నిన్న నమోదు అయిన కేసులో ఈ రోజు అట్టి కేసులో నిందితులుగా ఉన్న బీహర్కి చెందిన హమాలీలు రవీందర్ బింద్,దీపక్ కుమార్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది.కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కి తరలించబడును. ఇట్టి కేసులో తదుపరి విచారణ జరిపి ఇందులో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై చట్టరిత్యా చర్య తీసుకోబడును. రైతులను, ప్రజలను మోసం చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోబడును.ధాన్యం కొనుగోలు లేదా ఇతర ఏ విషయాలలో అయినా రైతులకు సందేహం వస్తే వెంటనే పోలీస్ స్టేషనికి సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు.