తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అనే అంశం పై వ్యాసరచన పోటీలు
తాండూర్ : తాండూర్ మండల్ అయినెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల తెలంగాణ మోడల్ స్కూల్లో బుధవారం రోజున భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ డివిజన్ ఇంచార్జ్ జిలాని ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ గారి జన్మదిన పురస్కరించుకొని విద్యార్థులకు అంశం : తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అనే అంశం పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎంపీటీసీ అధ్యక్షులు సాయి రెడ్డి,బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు శకుంతల,స్థానిక సర్పంచ్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమా శంకర్ పటేల్,గుంత బాసుపల్లి ,మిట్ట బాచుపల్లి, బిజ్వార్ గ్రామాల సర్పంచ్లు జగదీష్,నరేందర్ రెడ్డి,డి.నరేందర్ రెడ్డి మిట్ట బాస్ పల్లి ఉప సర్పంచ్ గోవింద్,బిఆర్ఎస్ వి.నాయకులు దీపక్ రెడ్డి పరమేష్ మజార్ రవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిధి సాయి రెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు మాట్లాడుతూ దేశంలో ఇంకా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని జరుగుతున్న అభివృద్ధి మన కండ్లకు కనిపిస్తుందని దానికి నిదర్శనమే దళిత బంధు,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ,రైతుబంధు,రైతు బీమా,ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శకుంతల దేశ్పాండే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు మహిళలకు సముచిత స్థానం ఇచ్చారని రాష్ట్రంలో ప్రతిష్టమైన పోలీసు వ్యవస్థ ఉందన్నారు.మహిళలకు పుట్టిన బిడ్డ నుండి వృద్ధాప్యం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థి విభాగం ఇంచార్జ్ జిలాని మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా వెయ్యికి పైగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతోపాటు వసతి ని ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో విద్యను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ప్రశంసించారు.అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.మొదటి బహుమతి మానస యాదవ్ ద్వితీయ బహుమతి కే.నిహారిక తృతీయ బహుమతి కె.అఖిల ఈ ముగ్గురికి బహుమతులతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమాలలో విద్యార్థులు,ఉపాధ్యాయులు నాయకులు తదితరులు పాల్కొన్నారు.