గ్రామాలల్లో కరెంటు బిల్లుల దోపిడీ తెదేపా నేత ఎం శ్రీనివాస్
బషీరాబాద్ : బషీరాబాద్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెంచి పేద ప్రజల నుండి డబ్బులను వసూల్ చేస్తున్నారని చేవెళ్ల పార్లమెంట్ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు.బషీరాబాద్ మండల్ కొర్విచెడ్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్న కరెంటు సిబ్బంది సమయానికి డబ్బులు లేనివారికి కరెంట్ కట్ చేస్థమంటూ బెదిరింపులు చేస్తున్నారు.కరెంట్ సిబ్బందితో టీడీపీ నేత శ్రీనివాస్ మాట్లాడి తెలుసుకున్నారు.కరెంటు సిబ్బంది వారు మాట్లాడుతూ అందరి దగ్గర ఎంత బిల్ ఉంటే అంత పూర్తి కట్టించుకుంటున్నం లేకుంటే కరెంటు వైర్లు కట్ చేస్తాం మాకు పై నుండే ఆర్డర్ ఉంది అని అన్నారు.శ్రీనివాస్ వారితో మాట్లాడుతూ పేదవారు ఉంటే కొద్ది కొద్దిగా చెల్లిస్తారు మీరు వారికి సహకరించాలి కొందరికి పదివేలు మరికొందరికి ఇరవైవేలు వుంటయ్ ఒకేసారి చెల్లించలేరు కదా అని అన్నారు.మీరు అర్థం చేసుకొని పేదవారికి ఇబ్బంది పెట్టొద్దని కోరారు.
మరింత సమాచారం క్లిక్ చేయండి... * తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు