బషీరాబాద్ పోస్ట్ ఆఫీస్ లో చోరీకి యత్నం
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ పట్టణంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో చోరీకి యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న పరమేశ్వర శనివారం నాడు విధులు ముగించుకొని పోస్ట్ ఆఫీస్ కు తాళాలు వేసి వెళ్లిపోయాడు. సోమవారం పోస్ట్ ఆఫీస్ కు వచ్చి తాళం తీసి చూడగా తన టేబుల్ పై ఉన్న కౌంటింగ్ మిషన్ ప్రింటర్ కనిపించలేదు. దీంతో పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్లి చూడగా అక్కడ పడి ఉన్న కౌంటింగ్ మిషన్ ఉండటానికి గమనించి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎస్సై విద్యా చరణ్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.