గిరిజన పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
* ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇచ్చిన మద్దిశెట్టి
* BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు
* Memo No.13654/Assm,I(1)/2021 government of Telangana,
* RC No.E3-3959/2022 district collector kothagudem,
* RC No.E2-1411/2022 district collector kothagudem,
* W.P.No.24251/2022 Hon'ble High Court Telangana,
కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ఎమ్మార్వో గారికి శాంతినగర్ కాలనీ గిరిజన పోడు భూముల సమస్యలు పరిష్కరించాలంటూ,అదే విధంగా నిరుపేదలకు సర్వేనెంబర్ 19/1 లో గల 136 ఎకరాలు గట్టు పోరంబోకు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరారు.1995 నుంచి శాంతినగర్ కాలనీకి సంబంధించిన సర్వే నంబర్ 213 లో గల 400 ఎకరాల భూమిని 55 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు గొలుసు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని కోరడం జరిగింది.ఎమ్మార్వో గారు మాట్లాడుతూ కలెక్టర్ గారికి, ఏడీ గారికి లేఖ రాస్తానని, వీలైనంత త్వరగా సర్వే చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఎమ్మార్వో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.