ప్రీతి శరీరం మొత్తం గాయాలు సోదరుడు పృద్వి
హైదరాబాద్ Hyderabad : హైదరాబాద్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి కేసు రోజురోజుకీ మరింత సంచలనం రేపుతుంది నేడు ప్రీతి సోదరుడు విడుదల చేసిన ఒక వీడియో సంచలనంగా మారింది.తన సోదరికి సైఫ్ కి కలిపి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పిందంతా పూర్తిగా అబద్ధమని తెలిపారు హెచ్ ఓ డి పిలిచి తన సోదరిని కనీసం ఎలాంటి విచారణ కూడా చెయ్యకుండా తిట్టాడని పేర్కొన్నాడు.సైఫ్ కి పూర్తి సపోర్టుగా ఉన్న నాగార్జున రెడ్డితో కమిటీ ఏర్పాటు చేయడం ఏంటని? ప్రశ్నించాడు.
చేవెళ్లలో కారు బీభత్సం 2 కార్లు,15 ద్విచక్రవాహనాలు ధ్వంసం పూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి
అలా కమిటీని ఏర్పాటు చేస్తే సైఫ్ కి ఫేవర్ గానే రిపోర్టు ఇచ్చాడు కదా! అని ప్రశ్నించాడు.నిమ్స్ లో ప్రీతి పొత్తికడుపు వద్ద సర్జరీ చేశారని పృద్వి తెలిపాడు. ఆ సర్జరీ ఎందుకు చేశారనేది తెలియడం లేదన్నాడు. అలాగే ప్రీతి చేతి పైన గాయం ఉందని వెల్లడించాడు.ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలిసిస్ చేశారని తెలిపాడు.బ్లడ్ డయాలసిస్ చేస్తే పోస్టుమార్టం లో ప్రీతి బాడీలో ఉన్న ఇంజక్షన్ గురించి ఎలా తెలిసిందని ప్రశ్నించాడు.నిమ్స్ లో ఏం వైద్యం చేశారనేది తమకు చెప్పాలని ప్రీతి సోదరుడు డిమాండ్ చేశాడు.