క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి పైలెట్
* క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొంది స్థాయి
* క్రీడాకారులకు ఎల్లపుడూ నా సహకారం
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఇందూర్ గ్రామంలో ఎంపిటిసి ప్రవీణ్ పటేల్ వారి తండ్రి పటేల్ వీర్ శెట్టి జ్ఞాపకార్థం మేరకు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్కొని ప్రారంభోత్సవం చేశారు.అనంతరం ఎమ్మెల్యేను గ్రామ ప్రజలు సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అని తాండూరు అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.ఇందూరు గ్రామంలో పటేల్ వీర్ శెట్టి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని యువతను కోరారు.క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని క్రీడల్లో రాణించే యువతకు ఎల్లపూడు తనవంతు సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్,మున్సిపల్ వైస్ చైర్ షర్సన్ దీపా నర్సింలు,తాండూరు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అప్పు (నయీమ్) వీరశైవ సమాజం అధ్యక్షుడు పటేల్ శ్రీశైలం,పెద్దేముల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్,గ్రామ సర్పంచ్ పద్మమ్మ,మండల నాయకులు రమేష్, బందెప్ప,వెంకట్ గ్రామ యువకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.