కేంద్రం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి
* BJP డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్
* KCR నాయకత్వం వర్ధిల్లాలి
* DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు
కొత్తగూడెం Kothagudem : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్యాస్ ధరలు తగ్గించేవరకు ఆందోళనలు సాగిస్తామని అన్నారు.లేకపోతే BRS పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ప్రతి ఘటనలు తప్పవని హెచ్చరించారు.గ్యాస్ ధరలను తగ్గించాలనే BRS వర్కింగ్ కమిటీ అధ్యక్షులు,మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపుమేరకు, కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో పట్టణ BRS పార్టీ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.గురువారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఖాళీ గ్యాస్ బండలతో ఊరేగించి,ధర్నా కార్యక్రమం చేపట్టారు.BRS జిందాబాద్,KCR,KTR,వనమాల నాయకత్వం వర్ధిల్లాలి,BJP డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్,అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ZPTC సభ్యులు బరపటి వాసుదేవరావు,పట్టణ BRS అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్,వర్కింగ్ కమిటీ అధ్యక్షులుSVRK ఆచార్యులు,సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, డైరెక్టర్ కనగాల నారాయణ రావు, BRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి,కాల్వ ప్రకాశరావు,నరేందర్ రెడ్డి,కొత్తపల్లి సోమయ్య,వి.దుర్గాప్రసాద్,సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ తీసి ఎంపిక చేసిన ఎమ్మెల్యే వనమా పూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి |
జిల్లా కలెక్టర్ అనుదీప్ సన్మానం చేసిన అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామపంచాయతీ మరియు నందా తండా గ్రామపంచాయతీలో కంటి వెలుగు మరియు గర్భిణీ స్త్రీలకు శ్రిమంత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ శాంతి మరియు సర్పంచ్ బానోత్ గోవిందు,మాలోత్ లక్ష్మి,ఎంఆర్ఓ కృష్ణప్రసాద్,ఎంపిడిఓ రమేష్,ఎంపిఓ సత్యనారాయణ,ఆరిఫ్ ఖాన్,వాసిరెడ్డి మురళీ,కుమార స్వామి,సెక్రెటరీ రవి,బాబూరావు మరియు వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.