నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండలంలోని ఏకాంబరి దేవాలయం దగ్గర తలారి శరణప్ప గారి కొడుకు డాక్టర్ శ్రీశైలం వివాహంలో తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి బాబాయ్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి పాల్గొన్నారు.నూతన వధువువరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దీవించారు.బషీరాబాద్ పరిధిలోని మండల ST సెల్ అధ్యక్షులు నరేష్ చవాన్ గారి తమ్ముడు సురేష్ చవాన్ అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు.మరియు మాజీ ఎంపిటిసి శివప్రసాద్ ఆరోగ్యం బాలేదనే ఈ విషయం తెలుసుకొన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి ఆయన ఇంటికి పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్, సాయిలు గురు స్వామి, మధుసుధన్ రెడ్డి, పవన్ ఠాకూర్, పాండురంగ రెడ్డి, మల్లప్ప,మండల యూత్ ప్రెసిడెంట్ తాహేర్ బాండ్, యువ నాయకుడు రాజు,సూర్యానాయక్,మల్లప్ప,మహేందర్ తదితరులు పాల్కొన్నారు.
మోసగించిన బిజెపికి తగిన గుణపాఠం చెప్తాం
ఔట్సోర్సింగ్ లో ఉద్యోగం కలిపించిన పైలట్
మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోహన్ సింగ్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి సతీమణికి ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవతో ఔట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పించడం జరిగింది ఇట్టి ధ్రువీకరణ పత్రాన్ని ఎమ్మెల్యే గారు క్యాంపు కార్యాలయంలో అందించారు.అనంతరం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్,BRS సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్, రాజు పటేల్, తాహేర్ బాండ్, తదితరులు పాల్కొన్నారు.