మోసగించిన బిజెపికి తగిన గుణపాఠం చెప్తాం
* మాదిగ అమరవీరుల సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధిస్తాం
* కేంద్రంలో అధికారంలోకి వొస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ
* ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ
పెద్దేముల్ : మార్చ్ 1న మాదిగ అమరవీరుల దినోత్సవంగా సందర్భంగా పెద్దేముల్ మండల కేంద్రంలోని డా.అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ ఎంఎస్పి మండల ఇంఛార్జి స్వామీదస్ మాదిగ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకై మాదిగ మరియు 57 ఉపకులాలకు విద్యార్థులకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సంక్షేమ పథకాలలో జనాభా నిష్పత్తి ప్రకారం సమాన అవకాశాలు రావాలని ఎంఆర్పిఎస్ వేవస్తపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ నాయకత్వంలో 28సం జరుగుతున్న ఉద్యమంలో మొదటి సారి 1999లో ఎస్సీ వర్గీకరణ జరగటానికి మాదిగలకు దాదాపు 25000 ఉద్యోగాలు రావడానికి అమరవీరుల అత్యగం ముఖ్య పాత్ర పోషించి తమ ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళ కృషి వెలకట్టలేనిదనీ ఆయన అన్నారు.భవిషత్తులో తిరిగి ఎస్సీ వర్గీకరణ సదించటమే లక్ష్యంగా మందకృష్ణమాదిగ నాయకత్వంలో మరింత ఉదృతంగా ఉద్యమాన్ని చేసి తిరిగి ఎస్సీ వర్గీకరణ సాధించి అమరులకు అంకితమిస్తమని అన్నారు అదే విధంగా బిజెపి ప్రభుత్వం 2014లోనే ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు స్వయానా చెప్పిన హామీ ఇచ్చాన మాట మేము కేంద్రంలో అధికారంలోకి వొస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చి 8సం" రాలు గడుస్తున్న ఎలాంటి నిర్ణయం తోస్కొని బిజెపికి కచ్చితంగా రాజకీయంగా గుణపాఠం చెప్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి పెద్దేముల్ మండల ఇంఛార్జి స్వామీదస్ మాదిగ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం స్టేట్ కన్వీనర్ రియాజ్ ఎం ఆర్ పి ఎస్ నాయకులు బంద్యప్ప డబ్బుల నర్సింలు లక్ష్మయ్య రాజు దాసరి నర్సింలు ఎం ఎస్ ఎఫ్ నాయకులు బాల్రాజు మోహన్ బలరామ్ రాజు రత్నన్న చిన్న బలప్ప పురుషోత్తం అనిల్ నల్ల వెంకట్ రెడ్డి చిన్న బాపప్ప రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.