సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించి ఎమ్మెల్యే
* విద్యార్థులతో కలసి భోజనం
* పలు వివాహా శుభకార్యలలో
* ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించారు.సైన్స్ ల్యాబ్,ఆర్ట్స్ రూం,లైబ్రరీ,కిచన్ రూంలను పరిశీలించారు.కాసేపు విద్యార్థులతో కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు.నిజమైన విజేత తన పునాదిని మరువ వద్దు అని తెలిపారు.కళాశాలలో అర్ఓ ప్లాంట్,డైనింగ్ హాల్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఇస్తాం అని హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు పెద్దపీట వేస్తుంది అని తెలిపారు.త్వరలో పెద్దముల్ మండల్ లో 6 ఎకరాల్లో నూతన భవనం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తాండూర్ పట్టణంలో పలు వివాహా శుభకార్యలలో పాల్గొన్నారు.అనంతరం కురేషి ఫ్యామిలీ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెష్ మార్ట్ సూపర్ మార్కెట్ ను మరియు గౌతాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్ వాష్ ను ప్రారంభించారు.
మరియు పెద్దేముల్ మండలం మారేపల్లి గేట్ సమీపంలో మండల టీఅర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ యాదవ్ సోదరులు ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు,పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్,నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి,సీనియర్ నాయకులు రాజు పటేల్,అంతారం సర్పంచ్ రాములు,బిల్డింగ్ ఓనర్ ఆహాద్ బై,మున్సిపల్ కౌన్సిలర్లు ముక్తార్నాజ్,వెంకన్న గౌడ్,బిఆర్ఎస్వి నాయకులు ఏవి నైజర్,దీపక్ రెడ్డి,జిలాని ఆర్సిఓ మేడం శారద,ప్రిన్సిపాల్ మేడం సుజాత,మరియు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.