డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ తీసి ఎంపిక చేసిన ఎమ్మెల్యే వనమా
* తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ వన్
* ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజల ఆపద్బాంధవుడు
* సుమారు 700 మంది డబల్ బెడ్ రూమ్ ఇల్లు
కొత్తగూడెం : కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36 వార్డుల నుండి సుమారు 700 మంది డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ తీసి,లబ్ధిదారులను ఎంపిక చేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని నెంబర్ వన్ అని,ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలులో లేవని ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమల్లో వెనుకబడి ఉందని అన్నారు.నా తుది శ్వాస వరకు పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు.
BJP డౌన్ డౌన్,మోడీ డౌన్ డౌన్ పూర్తిగా చదవడానికి క్లిక్ చేయండి
ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేందర్,మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కొత్తగూడెం ఎమ్మార్వో రామకృష్ణ, కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్, 36 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రెవెన్యూ సిబ్బంది,లబ్ధిదారులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.