Type Here to Get Search Results !

Sports Ad

ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు గుడ్ న్యూస్ Good news for government employees and pensioners

 

ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు గుడ్ న్యూస్

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ట్రావెలింగ్‌ అండ్‌ కన్వీయన్స్‌ అలవెన్సును 30శాతం పెంచింది. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్‌ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లించనుంది.షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ఉద్యోగులకు స్పెషల్‌ కాంపన్సేటరీ అలవెన్స్‌ను ప్రభుత్వం 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకిచ్చే కన్వీయన్స్‌ అలవెన్స్‌ రూ. 2వేల నుంచి రూ. 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్‌ రూ.20లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం 2.73 శాతం డీఏ ప్రకటించింది. తాజాగా మరింత ప్రయోజనం కల్పించేలా ఆదేశాల జారీ చేయడంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం....  
* రాష్ట్రంలో నూతనంగా 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపటి నుండి గ్రూప్ 4 హాల్ టికెట్లు జారీ     భారత్ ప్రతినిధి ఇక్కడ క్లిక్ చేయండి
* కంది విత్తనాల చిరుపొట్లాలను అందజేసిన ఎమ్మెల్యే 
ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies