వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో భారీ వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. బషీరాబాద్ మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్ )గారు.గత రొండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని బషీరాబాద్ మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్ ) గారు.మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్నందున, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ వైర్లు వంటివి రైతులు తాకకుండా ఉండాలి.చిన్నపిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు గమనిస్తుండాలని అన్నారు.చెరువులలో చేపలు పట్టే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి.వాహన దారులు వెళ్లే క్రమంలో స్లీప్ అయ్యే అవకాశము ఉంటుంది, హెల్మెట్ తప్పకుండా ధరించాలి ఉరుములు మెరుపులు వచ్చే క్రమంలో చెట్ల వద్ద రైతులు ఉండకూడదని అన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీస్ లకు మరియు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని నర్సిరెడ్డి గారు సూచించారు ఇట్లు బషీరాబాద్ మండల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్)గారు.