Type Here to Get Search Results !

Sports Ad

గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం Fire at Gurukul's school


 గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలోరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు.దీపం ఆరిపోకుండా చూడడం కోసం చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటికి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. బయటకు వెళ్తున్న క్రమంలో మంటల్లో చిక్కుకున్న నీరజ్ అనే విద్యార్థి తో పాటు మరో విద్యార్థికి  గాయాలయ్యాయి, ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఘటనపై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సకాలంలో విద్యార్థులు బయటకు పరిగెత్తటంతో ముప్పు తప్పింది.

మరిన్ని వార్తల కోసం... 
 * ఎక్మాయ్ గ్రామం లో రాష్ట్ర మంత్రి వర్యులు మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణలో 7 ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇక్కడ క్లిక్ చేయండి
 * గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు? ఇక్కడ క్లిక్ చేయండి
 * రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
 * గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళా కు గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies