ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ త్వరలో 15వేల పోలీసు ఉద్యోగాలూ భర్తీ చేయనున్నట్టు చెప్పారు.విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూసే ప్రభుత్వం ఇది.
ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలకపాత్ర. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు.గత ప్రభుత్వం వాళ్ల కుటుంబసభ్యుల గురించి మాత్రమే ఆలోచించింది. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించింది. కుమార్తెను ప్రజలు ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి కేసీఆర్ ఆలోచించలేదు.ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఛైర్మన్ సభ్యులను నియమించాం. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.