పద్మ శ్రీ గ్రహీతలకు ప్రతి నెల రూ.25 వేలు పించన్ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు.అవార్డులతో మట్టిలో మాణిక్యాల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. చప్పట్లు, దుప్పట్లు కాదు కళాకారులకు నగదు సాయం కూడా అందిస్తా మని తెలిపారు.సీఎం. ఒక్కో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షల ఆర్థిక సాయంతో పాటు పద్మశ్రీ కళాకారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్ అంది స్తామని ప్రకటించారు.సంప్రదాయలు, భాషను గౌరవించుకునే విషయంలో మనమంతా ఏకం కావా ల్సిన అవసరం ఉంద న్నారు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగిన ఒక కారక్రమంలో పద్మ పురస్కార గ్రహీతలను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వెంకయ్య నాయుడికి సన్మానం అంటే మనల్ని మనం సన్మానిం చుకోవడమేనని చెప్పారు. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కుఅని చెప్పారు.ఆయనకు రాష్ట్రపతి అయ్యేఅన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. చిరంజీవి కమిట్ మెంట్ ఉన్న నటు డని చెప్పారు. పున్నమి నాగులో ఏ స్థాయిలో నటించారో సైరాలోనూ అదే స్థాయిలో నటించారని తెలిపారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. గొప్ప వ్యక్తుల పోత్సాహంతో ప్రజాపాలన కొనసాగిస్తా మని హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం...
* కేరళ ఆయుర్వేద బాలకల్పం గురించిన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పార్లమెంటు ఎన్నికలకు "సై" అంటున్న ప్రధాన పార్టీలు ఇక్కడ క్లిక్ చేయండి
* TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష : సీఎం రేవంత్ ఇక్కడ క్లిక్ చేయండి
* పద్మ శ్రీ గ్రహీతలకు ప్రతి నెల రూ.25 వేలు పించన్ : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇక్కడ క్లిక్ చేయండి