Type Here to Get Search Results !

Sports Ad

తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు రూ.50 వేల జరిమానా A woman who filed a false complaint will be fined Rs.50,000

తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు రూ.50 వేల జరిమానా

మహబూబాబాద్‌ Mahbubabad News భారత్ ప్రతినిధి : బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్‌ శుక్రవారం రూ.50 వేల జరిమానా విధించారు. మహబూబాబాద్‌ జిల్లాలోని పెద్దవంగర ఠాణాలో 2023 సెప్టెంబరు 22న బాలికపై అత్యాచారం జరిగినట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. ఓ యువకుడిపై అప్పటి ఎస్సై రాజు పోక్సో కేసు నమోదు చేసి.. కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆరు నెలలపాటు విచారణ సాగింది. న్యాయస్థానంలో సాక్షులను విచారిస్తున్న క్రమంలో బాలిక తల్లి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో ఆమెకు రూ.50 వేల జరిమానా కట్టాలని లేదా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలంటూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies