మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో జోష్ పెంచారు. ఓ వైపు సభలు నిర్వహిస్తూ నే.. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ మద్దతు పలుకు తున్నారు.ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం మెదక్ జిల్లాలో పర్యటించ నున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి ఆ జిల్లాకు ఈరోజు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. మెదక్ కాంగ్రెస్ ఎంపీ నీలం మధు నామి నేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.భారీ ర్యాలీగా తరలివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో రేవంత్ కూడా ర్యాలీలో, అలాగే రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించను న్నారు.గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు సీఎం దిశ నిర్దేశం చేయనున్నారు. తన ప్రసం గంతో రేవంత్ రెడ్డి కార్యక ర్తల్లో, నాయకుల్లో జోష్ నింపనున్నారు.ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మె ల్యే మైనంపల్లి హనుమంత రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అభ్యర్థి నీలం మధు హాజరుకానున్నారు.