Type Here to Get Search Results !

Sports Ad

రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం..Heavy rain in Palau district of the state.


 రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం..

* కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : భానుడి భగభగలతో ఇన్నాళ్లు అల్లాడిన ప్రజలకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతోంది. ముఖ్యంగా వరంగల్‌, హనుమకొండ, కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో, జనగామ: స్టేషన్ ఘనపూర్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో వడగండ్ల వాన కురుస్తుండటంతో ఐకేపీ సెంటర్‌లో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది.సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో మామిడి, నిమ్మ పంటలు నేలరాలుతున్నాయి. వర్షానికి సిద్దిపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న పత్తి , కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల చేతికి వచ్చిన వరి పంట, మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం...
* ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు? ఇక్కడ క్లిక్ చేయండి 
* మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం : తాండూరు ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం..ఇక్కడ క్లిక్ చేయండి
* అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో కూడా నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌.ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies