తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు మళ్ళీ పొడిగింపు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష,టెట్,కు దర ఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్కు దరఖాస్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రం లో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది అర్హత సాధించారు.