అలాంటిదేం లేదు... ఆ ప్రచారాన్ని నమ్మొద్దు
దిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విజ్ఞప్తి చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థుల చేతి వేలికి సిరా ఉంటే ప్రవేశ పరీక్షలు జరిగే హాలులోకి అనుమతించరంటూ సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. ఆ ప్రచారం పూర్తి నిరాధారమని.. ఎన్టీఏ అలాంటి నిబంధనలు/మార్గదర్శకాలేవీ విడుదల చేయలేదని స్పష్టం చేసింది.యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్టీఏ కోరింది. ఓటింగ్ అనేది పరీక్షల అర్హతపై ప్రభావం చూపదని సష్టం చేసింది. అందువల్ల అభ్యర్థులు రాబోయే పరీక్షలపై దృష్టిపెట్టి సన్నద్ధం కావాలని సూచించింది. నీట్ (యూజీ) పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు 011-40759000 లేదా neet@nta.ac.in మెయిల్ చేయవచ్చని తెలిపింది. కచ్చితమైన సమాచారానికి ఎన్టీఏ అధికారిక వెబ్సైట్www.nta.ac.inను సందర్శించవచ్చని తెలిపింది.