Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య❓ Three farmers committed suicide in Telangana on the same day

తెలంగాణలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య❓

కరీంనగర్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో మరో ముగ్గు రు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ (48) నాలుగు ఎకరాల పొలంలో వరి పంట వేయగా భూగర్భ జలాలు అడుగంటి పోవ డంతో 7 బోర్లు తవ్వించా డు. రూ. 6 లక్షల వరకు అప్పు కావడంతో పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం లోని ఎర్రచకృతండాకు చెందిన జాటోత్‌ శ్రీను (40) మూడున్నర ఎకరాలలో మిరప, రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మిరప సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పు చేయగా సాగు నీరు లేక నష్టాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) తనకున్న 8 ఎకరాలలో పత్తి సాగు చేస్తుండగా రూ. 35 లక్షల వరకు అప్పు చేశాడు. నీటి కొరత తెగుళ్లతో ఆశించిన పంట దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని వార్తల కోసం... 
* ఏమ్మెల్సీ కవిత బెయిల్ కు కోర్టు నిరాకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* తుక్కుగూడ జన జాతర సభలో జాతీయ  మేనిఫెస్టో ను విడుదల చేసిన రాహుల్ గాంధీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య❓ ఇక్కడ క్లిక్ చేయండి
* వడగాలులతో విల విల 8 జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇక్కడ క్లిక్ చేయండి
* మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు : సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీలు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies