UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ Hydeerabad News భారత్ ప్రతినిధి : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఫలితాల్లో ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. కాగా, UPSC ఆల్ ఇండి యా సర్వీసెస్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియ జేశారు.జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన పాల మూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్స్కు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.