Type Here to Get Search Results !

Sports Ad

ఏపీ టెట్‌-2024 ఫలితాలు విడుదల అర్హత సాధించని వారికి మళ్లీ టెట్‌ AP TET-2024 Results Released TET again for those who did not qualify


 ఏపీ టెట్‌-2024 ఫలితాలు విడుదల

అమరావతి Amaravathi  News  భారత్ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్‌- 2024 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్‌లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. టెట్‌ పరీక్షలో 58.4 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. లక్షా 37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. 

టెట్‌లో అర్హత సాధించని వారికి మరోసారి టెట్‌ నిర్వహిస్తామని, కొత్తగా బీఎడ్‌, డీఎడ్‌ పూర్తయిన వారికి కొత్త టెట్‌లో అవకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. మెగా  డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు. టెట్ ఫలితాల కోసం 2.35 లక్షల మంది ఎదురుచూశారని వెల్లడించారు. డీఎస్సీలో టెట్ అర్హతకు 20 శాతం వెయిటేజి ఉండడం తో అందరూ ఆత్రుతగా ఎదురుచూశారని వివరిం చారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. టెట్ ఫలితాల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies