ఈ నెల 25న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు?
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో మే 24 న నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 25న విడుదల కాను న్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీ కోడింగ్, ఆన్లైన్లో మార్కుల ఎంట్రీ పూర్తి అయినట్లు సమాచారం. కాగా ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నెల 26 లేదా 27న విడుదల చేయనున్నారు.