చిన్నారుల ఆరోగ్యానికి నులి పురుగుల నివారణ కీలకం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఏడాది వయసు నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలం దరికీ నులి పురుగుల నివారణ కోసం అల్బెండ జోల్ మాత్రలు వేసేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఇప్పటి కే, ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అయితే చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా వేయనుంది.