నేడు EAPCET-2024 ఫలితాలు విడుదల
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : నేడు EAPCET-2024 ఫలితాలు విడుదల ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET-2024 ఫలితాలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈఏపీసెట్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందన్నారు. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తామన్నారు.