రుణమాఫీ కొందరికే
* షరతులు, కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్
* పీఎం కిసాన్ నిబంధనలను రుద్దితే సగం మందికి రానట్టే!
* ఇదే జరిగితే 37 లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరం
* ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ రిటర్న్ దాఖలు
* చేసేవారు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం
* ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని హామీ
* ఇప్పుడేమో నిబంధనలు మార్చి కోతపెట్టే యత్నం
* హామీల భారం మోయలేక కొర్రీలు పెట్టే పనిలో!
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలుత డిసెంబర్ 9నే చేస్తానని నమ్మబలికి.. ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ వచ్చింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలోనూ హామీని మళ్లీ ప్రస్తావిస్తూ.. ఆగస్టు 15కల్లా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఊరూరా దేవుళ్లపై ఒట్లు కూడా వేశారు. తీరా ఓట్లపండుగ పూర్తయ్యాక పథకానికి నిబంధనలు రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. కొర్రీలు విధించి, కోతలు పెట్టి హామీల భారం తగ్గించుకు నేందుకు సిద్ధమైందని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల అక్కర తీరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. రూ.2లక్షల రైతు రుణమాఫీని కొందరికే వర్తింపజేసేలా కొత్త నిబంధనలను వర్తింపజేసే ఆలోచన చేస్తున్నది. రుణమాఫీలో కోతలు పెట్టి, షరతులు వర్తింపజేసి 'మమ' అనిపించేందుకు సిద్ధమవుతున్నది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వ్యక్తులు తదితరులంతా రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఉన్నది. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, విధి విధానాల ను రూపొందించడంపై దృష్టి సారించిన కాం గ్రెస్ ప్రభుత్వం 'అర్హుల' సంఖ్యను కుదించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కేంద్రం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిబంధనలను రైతు రుణమాఫీకి వర్తింపజేసేందుకు సూ త్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పీఎం కిసాన్ నిబంధనలను అడ్డంపెట్టుకుంటే దాదాపు 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నది.ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లించే ప్రైవేటు ఉద్యోగులు, వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైన పదువుల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. ఈ షరతుల కారణంగా రాష్ట్రంలోని సగానికిపైగా రైతులకు పీఎం కిసాన్ సాయం అందడం లే దు. కేంద్రం ఇస్తున్నది చాలా చిన్న మొత్తం కావడం, ఆ ఆరువేలనే మూడు విడతలుగా ఇస్తుండటంతో నష్టపోతున్న రైతులు కూడా దానిని సీరియస్గా తీసుకోవడం లేదు. మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మంది రైతులు తమకు ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం పొందుతున్నారు. కానీ, పీఎం కిసాన్ పథకం కింద 33 లక్షల మంది రైతులకే ఏడాదికి ఆరువేల చొప్పున పొందుతున్నా రు. రైతుబంధును పొందుతున్నవారిలో 37 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకాన్ని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే రాష్ట్రంలోని సుమారు 37 లక్షల మందికి రుణమాఫీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారం మోయలేక రైతులకు కోతలు
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులకు, ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుందనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేసింది. రుణమాఫీకి సుమారు రూ.35 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్రెడ్డి పలుమార్లు దేవుళ్ల మీద ఒట్టుపెట్టారు. అది కూడా మొత్తం రూ.2 లక్షల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే, రుణమాఫీకి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో విఫలమవుతున్న ప్రభుత్వం.. కోతలు విధించడం మీద దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. ఏదో కొందరు రైతులకు మాత్రమే 'మమ' అనిపించి, రుణమాఫీ చేశామంటూ ప్రచారం చేసుకొనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. షరతులు లేకుండా కేసీఆర్ రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు రూ.లక్ష వరకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసింది. ఇలా 2014లో 35.31 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ తర్వాత 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 23 లక్షల మంది రైతులకు చెందిన రూ. 13 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడం, ఇతర సమస్యలతో మరికొంత మందికి రుణమాఫీ చేయలేకపోయింది. ఈ విధంగా 2014, 2018లో మొత్తం 58 లక్షల మంది రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇందుకోసం రూ.29,144 కోట్లను వెచ్చించింది. దీంతో ఆయా రైతులు బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టిన పొలాలను విడిపించుకుని రుణ విముక్తులయ్యారు. గతంలో కేంద్రంలోని మన్మోహన్సింగ్ ప్రభుత్వమైనా, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వమైనా ఎటువంటి షరతులు లేకుండానే రైతులకు పంట రుణమాఫీ చేయడం విశేషం.