నేడే T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ జూన్ 29న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో ఇరు జట్ల మధ్య టైటిల్ మ్యాచ్ జరగనుంది.ఇంగ్లండ్ను ఓడించి టీమిండియా సెమీఫైనల్కు చేరుకుంది. అదే సమయం లో ఆఫ్ఘనిస్థాన్ను ఓడించి దక్షిణాఫ్రికా తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఒకవైపు, భారత జట్టు రెండవసారి T20 ప్రపంచ కప్ ఛాంపియన్గా మారడానికి ప్రయత్నిస్తుండగా, దక్షిణాఫ్రికా తన మొదటి ప్రపంచ కప్ ఫైనల్ను ఆడటానికి సిద్ధంగా ఉంది. ఈ ఇద్దరూ టీ20 ఇంటర్నేషనల్, వరల్డ్ కప్లో చాలా సార్లు ఢీకొన్నారు. ఈ క్రమం లో ఇరుజట్ల రికార్డులు ఓసారి చూద్దాం.దక్షిణాఫ్రికాపై భారత్దే పైచేయి.టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్- దక్షిణాఫ్రి కా, మధ్య ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరగ్గా అందులో టీమ్ ఇండియా 4 గెలిచి 2 ఓడింది. 2007లో జరిగిన తొలి ఎడిషన్లో భారత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.కాగా, 2009లో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2010లో దక్షిణాఫ్రికాపై 14 పరుగులతో విజయం2012లో 1 పరుగుతో, 2014లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే 2022లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.