Type Here to Get Search Results !

Sports Ad

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి A young man died of electric shock

 విద్యుత్ షాక్ తో యువకుడు మృతి 

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం భోజ్యా నాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని భోజ్యా నాయక్ తాండకు చెందిన గోపాల్ నాయక్ కొడుకు శ్రీనివాస్ (20) తాండూరులోని శాలివాహన డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం శ్రీనివాస్ తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిపోగా, డిగ్రీ పరీక్షలు ఉన్నాయని చదువుకోవడానికి శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అదే తాండాలో వారు నిర్మిస్తున్న కొత్త ఇంటికి అవసర నిమిత్తం కరెంటు మోటర్ మోటర్ ను బిగించి నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు  కరెంట్ షాక్ తగిలింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కింటి వారు వచ్చి చూడగా మిగతాజీవిగా పడి ఉన్నాడు. యువకుడి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తల కోసం... 
* జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... ఇక్కడ క్లిక్ చేయండి 
* ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి : PDSU కమిటీ డిమాండ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఆరోగ్యాంగా ఉండటానికి కొన్ని ఉత్తమైన ఆహారాలు ఇక్కడ క్లిక్ చేయండి
* విద్యుత్ షాక్ తో యువకుడు మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* పాస్ బుక్కులు, రేషన్ కార్డులు ఉన్న ఉన్న వారికే రుణమాఫీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో IPS అధికారుల బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* టీజీ లా సెట్ 2024 153వ ర్యాంక్ సాధించిన హరి ప్రసాద్ రెడ్డి, ఇక్కడ క్లిక్ చేయండి
* ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies